Vijaya Lakshmi
Published on Mar 22 2024
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?సర్పాలకు నాలుక చీలుకలుగా ఎలా మారింది?
సాగరమథనం అయిపొయింది. విష్ణుమాయతో దేవతలు అమృతాన్ని పొందగా, దానవులకు కష్టం మాత్రమె మిగిలింది. అయితే దేవదానవులు కలిసి తనను కవ్వపు తాడుగా చేసుకొని అమృతం సాధించిన తరువాత, దానిని విష్ణువు తెలివిగా దేవతలకు మాత్రమె దక్కేలా చెయ్యడం ఇదంతా చూసిన వాసుకి తెల్లపోయాడు. క్షీరసాగర మథన సమయంలో,కవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు కూడా అమృతంలో వాటా ఇస్తానని కూడా ఇవ్వకపోయేసరికి, ఏమీ చెయ్యలేక అమృత కలశం పెట్టిన చోటికి వెళ్లి,
ఆ కలశాన్ని పెట్టిన దర్భలమీద కాస్తయినా అమృతం పడిందేమో దానిని స్వీకరిద్దామని, ఆ దర్భలను నాలుకతో నాకేడట. అయితే దురదృష్ణం! వాసుకి సర్పానికి అమృతం దక్కలేదు సరికదా దర్భల పదునుకి నాలుక నిలువునా చీరుకు పోయి, రెండు నాలుకలుగా మారాయి. అదిగో అప్పటినుంచీ, వాసుకి సంతానమైన సర్పాలకు నాలుక నిలువునా చీరుకుని ఉండి, రెండు నాలుక లున్నట్లుగా అనిపిస్తుందని పురాణ కథనాలు చెప్తున్నాయి.
అయితే ఇలా సర్పాలకు నాలుక రెండుగా చీలికలుగా ఉండడానికి మరో కథనం కూడా చెప్తారు. ఆ కథనం గరుత్మంతునికి సంబంధించినది.గరుత్మంతుడు తన తల్లిని దాస్య విముక్తురాలిని చేసేందుకు చేసిన ప్రయత్నంలో సర్పాల మాత కద్రువ కోరిక ప్రకారం అమృతాన్ని తీసుకువచ్చి వారికివ్వడానికి అంగీకరించాడు. అలాగే స్వర్గానికి వెళ్లి అమృతాన్ని తెచ్చి, సర్పాలను శుచిర్భూతులై రమ్మని చెప్పగా సర్పాలు అలాగే వెళ్ళగా, వారు వచ్చేవరకు తాను తెచ్చిన అమృతభాండాన్ని పవిత్రమైన దర్భలమీద పెట్టాడట గరుత్మంతుడు. అయితే సర్పాలకు అమృతం దక్కకూడదన్న ఆలోచనతో వారు వచ్చేలోగానే ఆ అమృతభాండాన్ని ఇంద్రుడు తీసుకుపోయాడు. దాంతో చేసేదేం లేక ఆ దర్భలమీద పడిన అమృత బిందువులనైనా స్వీకరిద్దామని సర్పాలు ఆ దర్భలను నాకినపుడు ఆ దర్భల గరుకుదనానికి సర్పాల నాలుకలు చీలికలుగా మారిపోయాయని ఓ కథనం.