పూరీ జగన్నాథుని ఆలయంలో బంగారు పళ్ళెం మాయమయిన వేళ | పూరీ జగన్నాథుని భక్తుడు బంధు మొహంతి | bandhu mohanthy great devotee of puri jagannath swamy

Vijaya Lakshmi

Published on Jun 29 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

భక్తికి, దైవమహిమకు నిలువెత్తు నిదర్శనం బంధు మొహంతి కథ. పూరీ జగన్నాథ స్వామి భక్త జన రక్షణకు నిలువెత్తు నిదర్శనం బంధు మహంతి ఉదంతం. పూరీ జగన్నాథస్వామి మహిమలు చెప్పే గాథలు కోకొల్లలు. అందులో ఓడిశాలోని జాజ్ పూర్ కు చెందిన బంధు మొహంతి కథ ఒకటి.


సాక్షాత్తు ఆ జగన్నాథుడిని తన ఆప్తమిత్రుడిగా భావించి, కష్టకాలంలో సహాయం చేయమని కోరితే? ఆ భావంతుడు కూడా భక్తుడిని ప్రాణ స్నేహితుడుగానే భావిస్తే… ఆ అద్భుతమే జరిగింది బంధు మొహంతి విషయంలో.


ఈ కథ కేవలం ఒక చరిత్ర కాదు. దైవభక్తికి, అచంచలమైన విశ్వాసానికి, నిస్వార్థ ప్రేమకు నిదర్శనం.జగన్నాథుని భక్తుడు బంధు మొహంతి కథ



చాలా కాలం క్రితం, ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లాలో **బంధు మొహంతి** అనే నిరుపేద భక్తుడు నివసించేవాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. బంధు మొహంతికి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, కేవలం భిక్షాటన ద్వారానే కుటుంబాన్ని పోషించుకునేవాడు. బిక్ష ద్వారా ఎ రోజు తెచ్చుకున్నది ఆ రోజుకి వారి పోషణకు సరిపోయేది.



బంధుమోహంతి జగన్నాథుడికి గొప్ప భక్తుడు, భక్తుడు అనేకంటే జగన్నాథుడిని తన ప్రాణస్నేహితుడుగా భావించేవాడు. బంధు మొహంతి ధనం మీద కుటుంబం మీద దృష్టి లేకుండా నిమిత్తమాత్రుడుగా ఉంటూ, కేవలం జగన్నాథుని నామమే శాశ్వతం తప్ప ఈ జగత్తులో ప్రతిదీ తాత్కాలికమని భావించి ఉదాసీనంగా జీవించేవాడు. ఈ విధంగా, అతను తన రోజులను సంతోషంగా గడిపాడు. అతని భార్య పిల్లల ఆకలి కేకలు విన్న ప్రతిసారి, బంధు మొహంతి, "కంగారుపడకు, నాకు పూరీలో చాలా ధనవంతుడైన ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను చాలా మంచివాడు, ఎవరు సహాయం అడిగినా కాదనడు. మనకు కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాడు" అని చెప్పేవాడు. అయితే, ఆమెకు ఆ స్నేహితుడు ఎవరో మాత్రం తెలీదు.



ఒక సంవత్సరం ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండలేదు. ప్రజలంతా ఆకలితో అలమటించారు. ఈ పరిస్తితిలో మొహంతి ఏ ఇంటికి వెళ్లి భిక్షమడిగినా మాకే తినడానికి తిండి లేదు ఇక నీకేం పెడతాం అన్న మాటలే విన్పించేవి. దాంతో బంధుమొహంతి తన కుటుంబాన్ని పోషించుకోలేకపోయాడు. పిల్లలు ఆకలితో ముడుచుపోయారు, రెండు రోజులుగా ఇంట్లో తిండి లేదు. ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూసి భార్య కన్నీళ్లు పెట్టుకుంది.


పిల్లల బాధను చూసిన బంధుమొహంతి భార్య, పూరీ లో మీకు ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడని చెబుతారు కదా… వారి దగ్గరకు వెళ్లి మన పరిస్తితి చెప్తే సహాయం చేస్తారు కదా… వెళ్లి అడగవచ్చు కదా అంది.



భార్యా,పిల్లల ఆకలి బాధ ను చూసిన బంధు మొహంతి చివరకు తన కుటుంబాన్ని పూరీ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన కొడుకును భుజంపై మోస్తూ, ఒక కూతురి చేయి పట్టుకొని, భార్య మరొక కూతురిని ఎత్తుకొని పూరీకి సుదీర్ఘమైన ప్రయాణం ప్రారంభించారు. నాలుగు రోజుల తర్వాత, వారు పూరీకి చేరుకున్నారు. అలసిపోయి, ఆకలితో ఉన్న వారు పూరీ జగన్నాథ ఆలయం దక్షిణద్వారం దగ్గరకు చేరుకున్నారు.



అప్పటికే అక్కడ ఆలయద్వారం దగ్గర బాగా జనం ఉన్నారు. అక్కడున్న ద్వారపాలకులు కర్రలతో అడ్డుకొని భక్తులను లోనికి పంపిస్తున్నారు. చిరిగిన బట్టలతో నిరుపేదగా కనబడుతున్న బంధుమొహంతిని లోపలకు పంపకుండా అడ్డుకున్నారు. దాంతో బంధుమొహంతి, ఈ రోజు జనం ఎక్కువమంది ఉన్నారు. రేపు ఉదయాన్నే వెళ్లి నా స్నేహితుడిని కలుద్దాం ఆన్నాడు.


ఆ రాత్రి ఎక్కడ ఉండాలా అని చూస్తే అక్కడ పేజా నాలా ప్రదేశం కనబడింది. జగన్నాథుని నైవేద్యానికి వండిన అన్నం నుంచి వచ్చిన ద్రవాన్ని జమ చేసి దానిని ఆవులకు ఆహారంగా పెడతారు. ఆ ప్రదేశమే పేజా నాలా. అక్కడకు చేరుకున్న బంధుమొహంతి ఆ ద్రవాన్ని, ఆకలితో ఏడుస్తున్న పిల్లలకు ఆహారంగా తాగడానికి ఇచ్చి వారిని నిద్రపుచ్చాడు. అలసిపోయిన భార్య కూడా నిద్రపోయింది. బంధు మొహంతి తన స్నేహితుడు జగన్నాథుదిగా ఉన్న శ్రీకృష్ణుడిని, ప్రార్థించడం మొదలుపెట్టాడు. తన కష్టాలన్నీ చెప్పుకొని, తన పిల్లల ఆకలి తీర్చమని వేడుకున్నాడు.


youtube play button



ఆలయంలో జగన్నాథుని పూజారి స్వామికి రాత్రి నైవేద్యం సమర్పింఛి, పూజ ముగించిన తర్వాత, ఆలయ తలుపుకు తాళం వేసి, తన ఇంటికి వెళ్ళిపోయాడు.

అప్పుడు ఒక అద్భుతం జరిగింది.

ఇక్కడ జగన్నాథ స్వామి తన భక్తుడు ఏమీ తినకుండా, ఆకలితో నిద్రపోతున్నాడని చాలా ఆందోళన చెందాడు. నా స్నేహితుడు చాలా దూరం నుండి వచ్చాడు. అతనికి ఆహారం పెట్టకుండా నేను ప్రశాంతంగా ఎలా నిద్రపోగలను? ఈ సమయంలో నా సహాయం కోరుతూ నేనే అతని ఏకైక స్నేహితుడిని అని అనుకుని అతను ఇక్కడికి వచ్చాడు. అలాంటపుడు నా స్నేహితుడు ఆలయం బయట ఆకలితో అలమటిస్తుంటే ఇక్కడ నేనెలా ప్రశాంతంగా ఉండగలను. అనుకున్నాడు.



అప్పుడు జగన్నాథుడు ఒక బంగారు పళ్ళెంలో అన్ని రకాల ఆహారపదార్ధాలు, పళ్ళు మిఠాయిలు, పట్టుకొని, మారువేషంలో ఆలయ దక్షిణ ద్వారం వద్దకు వచ్చాడు. బంధుమొహంతిని పేరు పెట్టి పిలవసాగాడు. ఆ పిలుపు విన్న బంధుమొహంతి, ఇక్కడ ఈ పేరుతో చాలా మంది ఉంటారు. ఇక్కడ నేను ఎవరికీ తెలియదు, కాబట్టి నా పేరు పెట్టి నన్ను ఎవరు పిలుస్తారు?” అనుకున్నాడు. అందుకే , అతను స్పందించలేదు.


అప్పుడు జగన్నాథస్వామి మళ్ళీ పిలిచాడు, “ఓహ్, జాజ్‌పూర్ నుండి వచ్చిన బంధు మొహంతి, దయచేసి వినండి. కుటుంబంతో కలిసి పెజా నాలా సమీపంలో ఉన్న బంధుమొహంతి దయచేసి ఇక్కడికి రండి. నేను మీ కోసం ఆహారం తెచ్చాను అన్నాడు. ఇది విన్న బంధు మారువేషంలో ఉన్న జగన్నాతుడ్ని చేరుకున్నాద్.


బంధు మొహంతి, వీటిని నీ స్నేహితుడు జగన్నాథుడు పంపాడు. ఈ ప్రసాదం తీసుకో, నీ కుటుంబం ఆకలి తీరుతుంది" అని చెప్పాడు. ఆ మాటలు విని బంధు మొహంతి ఆశ్చర్యపోయాడు. భగవంతుడి దయకు పొంగిపోయాడు. భార్యా పిల్లలను నిద్ర లేపాడు. వారితో కలిసి, మధుర పదార్ధాలతో ఉన్న ఆ ఆహారాన్ని సంతోషంగా, తృప్తిగా ఆరగించాడు. పళ్లాన్ని శుభ్రం చేసి తిరిగి ఇద్దామని దక్షిణద్వారం వద్దకు వెళ్ళాడు బంధుమొహంతి. కాని అక్కడ తనకు ఆహారాన్ని తెచ్చి ఇచ్చిన బ్రాహ్మణుడు కనబడలేదు. సరే ఆటను

ప్లేట్ శుభ్రం చేసిన తర్వాత, ప్లేట్ తిరిగి ఇవ్వడానికి బంధు మొహంతి దక్షిణ ద్వారం వద్దకు వెళ్ళాడు. కానీ ఆశ్చర్యకరంగా అక్కడ బ్రాహ్మణుడు లేడు. దాంతో బ్రాహ్మణుడు వేల్లిపోయాదేమో, సరే రేపు ఇద్దాంలే అనుకోని తిరిగి తానున్న స్థలం పేజా నాలా కు చేరుకొని, ఆ పల్లాన్ని తన దగ్గరున్న వస్త్రాలలో ఒకదాన్ని తీసుకొని అందులో పల్లాన్ని బద్రంగా చుట్టి పెట్టి పడుకున్నాడు.



తెల్లవారగానే ఆలయ పూజారులు వచ్చారు. ఆలయం తలుపులు తెరిచారు. వారికి తమ రత్న భండారంలోని ఒక బంగారు పళ్ళెం కనబడలేదు. ఎక్కడ వెదికినా అది దొరకలేదు. బంధు మొహంతికి ప్రసాదం తెచ్చిన పళ్ళెమే అది. అంతా వెతికారు. చివరికి పూజారులు దొంగతనం గురించి ఆలయ నిర్వాహకులకు నివేదించారు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఆలయం యొక్క దక్షిణ ద్వారం దగ్గర నిద్రిస్తున్నట్లు గుర్తించారు. బంగారు పళ్ళెం అతని వస్త్రంలో చుట్టబడి ఉండటం వారు చూసారు. వెంటనే బంధు మొహంతిని పట్టుకున్నారు. వారు అతన్ని తాడుతో బంధించి, తీవ్రంగా కొట్టి, బంగారు పళ్ళెంను తీసుకుపోయారు.

తనకేమీ తెలియదని, రాత్రి మధ్యలో ఒక బ్రాహ్మణుడు ప్రసాదంతో నిండిన ఈ పళ్ళెంను ఎలా ఇచ్చాడో బంధు మొహంతి మరియు అతని భార్య ఇద్దరూ వివరించారు. తిన్న తర్వాత, అతను పళ్లాన్ని బ్రాహ్మణుడికి తిరిగి ఇవ్వడానికి వెళ్ళినా అతడు కనబడలేదనీ కానీ అతను కనిపించలేదు, నేను దొంగను మొర్రో అని ఎంత చెప్పినా వినకుండా అతని మీద దొంగతనం నేరం మోపి రాజు ముందు హాజరుపరిచారు. బంధు మొహంతిని బంధించి, చెరసాలలో వేశారు. వారు చెప్పినదానిని ఎవరూ పట్టించుకోలేదు. అతన్ని జైలులో పెట్టారు.


బంధు మొహంతి ఇక చేసేదేం లేక ఖైదులో కూర్చొని, తన మనస్సును జగన్నాథుడిపై నిలిపి ప్రార్థనలు చేయడం ప్రారంభించాడు: ప్రియమైన జగన్నాథ, నేను మీరు ఏమిచేయాలనుకుంటు న్నారోచెయ్యండి. నాకు మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు. నీ పాదాలే నాకు దిక్కు అనుకుంటూ అతను జగన్నాతుడిని వేడుకున్నాడు.


జగన్నాథుడు తన భక్తుడి పట్ల జరిగిన అన్యాయాన్ని చూసి చింతించాడు. సహించలేకపోయాడు. ఆ రాత్రి, జగన్నాథుడు గజపతి మహారాజు కలలో కనిపించి, బంధు మొహంతి తన భక్తుడని, అతను నిర్దోషి అని, స్వయంగా తానే అతని ఆకలి తీర్చడానికి పళ్ళెంలో ప్రసాదం ఇచ్చానని వివరించాడు. వెంటనే బంధు మొహంతిని చెరసాల నుండి విడుదల చేయమని ఆదేశించాడు.


వెంటనే నిద్ర మోల్కొన్న రాజు హుటాహుటిన వెళ్లి బంధుమొహంటిని ఖైదు నుంచి విడుదల చేసాడు. నిజాన్ని గ్రహించలేక, మీ గొప్పతనాన్ని తెలుసుకోనలేక తమవల్ల జరిగిన పొరపాటుకు మన్నించమని కోరి వారిని విడుదల చేసాడు. మంచి వస్త్రాలను ఇచ్చి, తలపాగా చుట్టి అతనిని రాజ మర్యాదలతో సత్కరించాడు. అతని కుటుంబాన్ని ఆదరించాడు. ఆలయపు దక్షిణద్వారం దగ్గరే అతనికి నివాసం ఏర్పాటు చేసాడు. అంతేకాకుండా, **ఆలయంలోని ఖజానాకు అతనిని నిర్వాహకుడిగా నియమించాడు.**

అప్పటి నుండి బంధు మొహంతి కుటుంబం పూరీ క్షేత్ర లోనే నివసిస్తూ జగన్నాథుడి సేవలో తరించింది. ఈనాటికీ, బంధు మొహంతి వారసులు జగన్నాథ ఆలయంలో ఖజానా నిర్వాహకులుగా సేవలందిస్తున్నారు.

బంధు మొహంతి కథ జగన్నాథుని అపారమైన దయను, తన భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియచేయడంతో పాటు, నిస్వార్థ భక్తి, అచంచలమైన విశ్వాసం ఉంటే ఎప్పుడూ దైవం మనకు అండగా నిలుస్తుందని చెబుతుంది.

Recent Posts
వైజాగ్ బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో వైభవంగా శ్రావణలక్ష్మీ పూజలు  | Shravana Lakshmi pooja in Vizag sri kanakamahalakshmi temple
వైజాగ్ బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో వైభవంగా...
రాధాకృష్ణుల సంయుక్తావతారం చైతన్య మహాప్రభు | Great devotee of puri jagannatha swamy      |     chaitanya mahaprabhu bhakti udyamam
రాధాకృష్ణుల సంయుక్తావతారం చైతన్య మహాప్రభు | Great...
ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం టికెట్లు | Sri Srinivasa divyanugraha special homam tickets release on August 1st
ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో శ్రీ...
ఈ 5 కృష్ణ దేవాలయాలను తప్పకుండా చూడాల్సిందే  | Must visit these 5 Srikrishna temples in India
ఈ 5 కృష్ణ దేవాలయాలను తప్పకుండా చూడాల్సిందే...
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు | Vijayawada kanakadurga temple Shravan festivals
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు |...