Vijaya Lakshmi
Published on Dec 08 2025
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది.స్పర్శ దర్శనం,అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.
రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని పంపిణీ చేస్తారు. స్పర్శ దర్శనం టికెట్పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్కు ఒక లడ్డూను అందజేస్తున్నారు.
ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయంలోని 9,10 కౌంటర్లలో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను అందజేస్తారని ప్రకటించారు. కాబట్టి టికెట్లు తీసుకున్న ఈ భక్తులు ఈ కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవచ్చని అధికారులు సూచించారు.
స్థానిక చెంచు గిరిజనులకు కూడా ఒక శుభవార్త అందించారు. స్థానిక చెంచులకు ప్రతి నెలలో ఒకరోజు “మల్లన్న స్పర్శ దర్శనం” అవకాశం కల్పించాలని నిర్ణయించారు. కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు కూడా బోర్డు ఆమోదం తెలపింది.
ఇవి కూడా చూడండి