మూతపడిన తిరుమల శ్రీవారి పుష్కరిణి | Tirumala srivari pushkarini closed

Vijaya Lakshmi

Published on Jul 20 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

తిరుమలలో స్వామి పుష్కరిణి మూతపడింది.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది శ్రీవారి పుష్కరిణికి  మరమ్మతులు నిర్వహిస్తారు.

 ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు జూలై 20 నుండి ఆగస్టు 19వ తేదీ వరకు నెలరోజులపాటు  నిర్వహించనున్నారు.

ఈ ఏడాది సెప్టెంబరు 24 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.


ఆ కారణంగా ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు.




Recent Posts