Vijaya Lakshmi
Published on Jun 29 2026
Vijaya Mavuru
మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...
Want to know more about me and my work?భారతదేశంలో ఉన్న నాలుగు అతి ముఖ్యమైన 'ఆది శక్తి పీఠాలలో' తారా తారిణి ఒకటి. ఇక్కడ సతి దేవి 'స్తన భాగం' పడిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ కొలువబడే 'తార' 'తారణి' సామాన్యమైన దేవతలు కాదు. వీరిని కవల సోదరీమణులుగా కోలుచుకుంటారు స్థానికులు." హిమాలయాల నుండి వచ్చిన దేవతలు అని కొందరు అంటారు, మరికొందరు వీరు సాక్షాత్తు శక్తి స్వరూపాలని నమ్ముతారు
అవును.. భారతదేశంలో ఎన్నో శక్తిపీఠాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిలోకి అత్యంత ప్రాచీనమైన, రహస్యమైన ఒక దివ్య క్షేత్రమే ఒరిస్సాలోని 'కుమారి పర్వతం' పై వెలిసిన "తారా తారిణి" ఆలయం. ఇక్కడికి వెళ్ళిన భక్తులకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అసలు ఈ జంట దేవతల వెనుక ఉన్న పౌరాణిక సత్యం ఏంటి? ఈ క్షేత్రం గురించిన పూర్తి రహస్యాలను తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం, ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిగా చెప్తారు. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న తర్వాత, మహాశివుడు ఆమె దేహాన్ని భుజాలపై వేసుకుని ప్రళయ తాండవం చేశాడు. ఆ సమయంలో విశ్వాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఆ దేహ భాగాలు పడిన ప్రతీ చోటా ఒక శక్తిపీఠం వెలిసింది.
సతీదేవి శరీరంలోని స్తన భాగం ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉన్న ఈ కుమారి పర్వతంపై పడ్డాయని దేవీ భాగవతం, కాళికా పురాణం చెబుతున్నాయి. అందుకే ఇది నాలుగు ప్రధాన ఆది శక్తిపీఠాలలో ఒకటిగా పూజలందుకుంటోంది. 'తారా', 'తారిణి' అనే ఇద్దరు దేవతలు ఆదిశక్తి స్వరూపాలైన జంట సోదరీమణులుగా ఇక్కడ కొలువై ఉన్నారు.
ఈ క్షేత్రానికి సంబంధించి స్తానికంగా బాగా ప్రసిద్ధి చెందినా మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం బాసు ప్రహరాజ్ అనే ఒక గొప్ప దేవీ భక్తుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేరు. ఒకరోజు తారా, తారిణి ఇద్దరు చిన్న పిల్లల రూపంలో ఆయన ఇంటికి వచ్చి, ఆయనకు పుత్రికలుగా జీవించారు. కొన్నాళ్ల తర్వాత వారు సమాజానికి దేవీ స్వరూపాలుగా తమ నిజరూపాన్ని చూపించి, ఈ కుమారి పర్వతంపై అంతర్ధానమయ్యారు. ఆ తర్వాతే వారు బాసు ప్రహరాజ్కు కలలో వచ్చి చెప్పడంతో ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని స్థానికులు నమ్ముతారు.
ఈ అద్భుత ఆలయం ఒడిశాలోని గంజాం జిల్లా, బ్రహ్మపూర్ (Berhampur) నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, పురుషోత్తంపూర్ సమీపంలో ఉంది. ఋషికుల్య నది ఒడ్డున ఉన్న 'కుమారి' అనే కొండపై ఈ ఆలయం వెలిసింది.
తారా తారిణి క్షేత్రానికి ఉన్న మరొక అత్యంత రహస్యమైన, ఆసక్తికరమైన కోణం "తాంత్రిక సాధన". భారతదేశంలోని పురాతన తాంత్రిక పీఠాలలో ఇది ఒకటి కావడంతో, కాలక్రమేణా దీని చుట్టూ కొన్ని ప్రతికూల ప్రచారాలు చేతబడి, క్షుద్రదేవతారాధన వంటి అపోహలు కూడా అల్లుకుపోయాయి.
"ఈ క్షేత్రం కేవలం సాధారణ భక్తులకే కాదు... శతాబ్దాలుగా తాంత్రిక ఆచారాలకు, రహస్య సాధనలకు కూడా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. క్షుద్రపూజలు జరుగుతాయనే పుకార్లు కూడా ఉన్నాయి. అసలు ఇందులోని నిజానిజాలు ఏంటి? అపోహలు ఏంటి? ఇప్పుడు చూద్దాం."
❌ అపోహ 1: ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ లేదా క్షుద్రపూజలు (Dark Arts) జరుగుతాయి. అన్న ప్రచారం ఉంది. అయితే అది కేవలం అపోహ మాత్రమె అంటారు పెద్దలు.
✔️ నిజం: చాలా మంది తాంత్రిక పూజలు అనగానే చేతబడి, ఇతరులకు కీడు చేసే విద్యలు అనుకుంటారు. కానీ అది ముమ్మాటికీ అపోహ. తారా తారిణి ఆలయం "సనాతన బౌద్ధ మరియు హిందూ తంత్ర" శాస్త్రాలకు కేంద్రం. ఇక్కడి తంత్ర సాధన అనేది కేవలం ఆత్మసాక్షాత్కారం, కుండలినీ శక్తిని జాగృతం చేయడం , లోక కళ్యాణం కోసం మాత్రమే చేసే శ్వేత తంత్రం (White Tantra). ఇక్కడ ఎవరికీ కీడు చేసే శక్తులు గానీ, క్షుద్రపూజలు గానీ లేవు. ఇక్కడి అమ్మవార్లు కేవలం రక్షణ ఇచ్చే తల్లులు.
❌ అపోహ 2: ఒకప్పుడు ఇక్కడ పూర్వం నరబలులు ఇచ్చేవారని కూడా అంటారు. అది కూడా ఒక అబద్దపు ప్రచారం మాత్రమె అంటారు పరిశోధకులు.
✔️ నిజం: ఈ ఆలయ చరిత్ర శతాబ్దాల నాటిది కావడం, కపాలధారులు (కపాలికులు) ఒకప్పుడు ఇక్కడ సాధన చేశారనే ప్రచారం ఉండడం వల్ల ఇక్కడ నరబలులు జరిగేవనే అపోహ పుట్టింది. కానీ దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇక్కడి పూజా విధానాలు తీవ్రంగా (ఉగ్ర రూపంలో) ఉన్నప్పటికీ, అవి అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ మోహాలను బలి ఇవ్వడానికి ప్రతీకలే తప్ప, ప్రాణ బలులు కావు. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా సాత్విక, వైదిక పద్ధతుల్లోనే పూజలు జరుగుతాయి.
❌ అపోహ 3: సామాన్యులు ఇక్కడికి వెళ్తే కీడు జరుగుతుంది లేదా భయపడుతూ ఉంటారు.
✔️ నిజం:ఇదొక తాంత్రిక పీఠం అని, సామాన్యులు ఇక్కడికి వెళ్తే కీడు జరుగుతుంది లేదా భయపడుతూ ఉంటారు. కానీ తారా తారిణి క్షేత్రం భక్తుల పట్ల అత్యంత కరుణామయమైనది. ఇక్కడి తాంత్రిక వైబ్రేషన్స్ వల్ల సామాన్య భక్తులలో ఉన్న మానసిక భయాలు, దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోతాయే తప్ప ఎలాంటి కీడు జరగదు. గ్రహదోషాలతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఆ దోషాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.
1. 999 మెట్ల ప్రయాణం: ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 999 మెట్లు ఎక్కాలి. లేదా ఘాట్ రోడ్ ద్వారా వాహనాల్లో కూడా వెళ్ళవచ్చు. మెట్లు ఎక్కుతూ వెళ్తుంటే చుట్టూ ఉండే ప్రకృతి దృశ్యాలు మనల్ని మైమరపిస్తాయి.
2. పురాతన రాతి విగ్రహాలు: గర్భగుడిలో తారా, తారిణి దేవతల విగ్రహాలు రాతితో మలచబడి, బంగారు మరియు వెండి ఆభరణాలతో, సింధూర అలంకరణతో అత్యంత శక్తివంతంగా కనిపిస్తాయి. వీరి మధ్యలో మానవ తల ఆకారంలో ఉండే కొన్ని పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయి.
3. బౌద్ధమత అనుసంధానం: ఒకప్పుడు ఈ ప్రాంతం బౌద్ధమతానికి పెద్ద కేంద్రంగా ఉండేది. బౌద్ధ తంత్ర శాస్త్రంలో 'తారా దేవి' ముఖ్యమైన దేవత. అందుకే ఈ ఆలయానికి హిందూ మరియు బౌద్ధ సంస్కృతుల కలయికగా ఒక ప్రత్యేక విశిష్టత ఉంది.
· "ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు చాలా మందికి ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అది భక్తియా లేక నిజంగా అక్కడ ఏదైనా శక్తి ఉందా?" అనే ప్రశ్న చాలా మందిలో రావచ్చు.
· కానీ ఇక్కడికి వెళ్ళిన ప్రతీ ఒక్కరూ చెప్పే మాట ఒక్కటే... కొండ కింద ఉన్నంత సేపు సాధారణంగానే అనిపించినా, ఎప్పుడైతే మనం కొండపైకి చేరుకుని, ఆ గర్భగుడి ముందర నిలబడతామో, అక్కడ తెలియని ఒక ప్రశాంతత, ఒళ్ళు గగుర్పొడిచే వైబ్రేషన్స్ అనుభవంలోకి వస్తాయి.
· సైన్స్ పరంగా చూస్తే... చుట్టూ ప్రవహించే నది, పచ్చని కొండలు, శతాబ్దాలుగా అక్కడ జరుగుతున్న మంత్రోచ్ఛారణల వల్ల ఆ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూస్తే... అది సాక్షాత్తు ఆ జంట తల్లులు తారా తారినిల ఉనికి. అందుకే నాస్తికులు సైతం ఇక్కడి వాతావరణానికి, ఆ శక్తికి తలవంచక తప్పదు. అది కేవలం భ్రమ కాదు... ఒక అద్భుతమైన దివ్య అనుభూతి!
· "ఈ ఆలయం కేవలం పూజలకు మాత్రమే కాదు, తాంత్రిక ఆచారాలకు కూడా కేంద్రం: అసలు రహస్యం ఇక్కడే ఉంది...) ఒకప్పుడు ఇక్కడ జరిగిన ఆచారాలు ఎంతటి శక్తిని ప్రసాదిస్తాయో స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎవరూ ఊహించని విషయం ఏంటంటే, ఈ కొండ కింద ఉన్న భూగర్భ మార్గాల గురించి, అక్కడ జరుగుతాయని చెప్పే రహస్య పూజల గురించి ఇప్పటికీ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. శాస్త్రీయంగా చూస్తే, ఈ కొండలో ఉన్న అయస్కాంత క్షేత్రం, ఆలయ నిర్మాణం మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఎవరికీ తెలియదు. కొందరు ఇది కేవలం మూఢనమ్మకం అంటారు, కానీ ఇక్కడికి వెళ్ళిన వారు అనుభవించే ఆ 'శక్తి' దేని సంకేతం?"
· ఇక్కడ విగ్రహాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇవి కేవలం విగ్రహాలు కావు, ఇవి 'జీవంతమైన శక్తి స్వరూపాలు' అని భక్తులు నమ్ముతారు. తారా మరియు తారిణి విగ్రహాలను చూస్తే ఒకేలా ఉంటాయి. ఎందుకు ఇలా? ఇది కేవలం శిల్పకళా అద్భుతమా, లేక దీని వెనుక 'ద్వంద్వ శక్తి' (Duality of Energy) అనే తాంత్రిక రహస్యం ఉందా? అసలు ఈ 'తంత్ర' విద్యకు ఈ అమ్మవార్లకు ఉన్న సంబంధం ఏంటి? మన పూర్వీకులు 'తంత్ర' అంటే ఏదో భయంకరమైనది కాదు, అది విశ్వాన్ని అర్థం చేసుకునే ఒక గొప్ప 'సైన్స్' అని ఈ ఆలయం ద్వారా నిరూపించారు."
"ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ అనుభూతి కలుగుతుంది. అసలు రహస్యం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న 'పవిత్ర జ్యామితి' (Sacred Geometry) ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటి. ఇక్కడ వాడిన 'యంత్రం' నిర్మాణం, నక్షత్రాల అమరికకు మరియు భూమిలోని శక్తి కేంద్రాలకు అనుసంధానించబడి ఉంటుంది. స్థానికులు చెప్పే కథల ప్రకారం, ఒకప్పుడు ఇక్కడ తాంత్రిక యోగులు ఈ కొండపై కూర్చుని అదృశ్యమయ్యేవారని, వారు విశ్వంలోని మర్మాలను ఈ ఆలయం ద్వారా డీకోడ్ చేసేవారని అంటారు. ఎవరూ ఊహించని విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వారు కచ్చితంగా ఏదో ఒక మార్పును తమ జీవితంలో చూస్తారని అంటారు. శాస్త్రీయంగా చూస్తే ఇది 'సైకో-అకౌస్టిక్' ప్రభావం అని కొందరు అంటారు. కానీ భక్తుల నమ్మకం ముందు సైన్స్ కూడా తలవంచాల్సిందే!"
· "ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా మందిరం కాదు, ఇది విశ్వశక్తిని పొందే ఒక పెద్ద రిసీవర్ (Receiver). మన తాంత్రిక ఆచారాలలో 'మంత్రం' మరియు 'యంత్రం' ఎలా పనిచేస్తాయో చెప్పడానికి తారా తారిణి ఆలయం ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఆ కవల సోదరీమణులు, మనలోని అంతర్లీన శక్తికి సంకేతాలు. ఒక్కటి చంద్రుని శీతలత్వానికి, మరొకటి సూర్యుని ఉష్ణత్వానికి ప్రతీక. ఈ రెండింటి సమతుల్యతనే మనం 'జీవితం' అంటాం. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని వందల ఏళ్ల క్రితమే మనకు అందించారు ఋషులు.
"నిజానికి, మన తాంత్రిక ఆలయాల వెనుక ఉన్నది కేవలం భక్తి కాదు, ఒక అద్భుతమైన సైన్స్! ఇక్కడ వాడిన గణితం ... ఒక వైబ్రేషన్ పాయింట్ అని చెప్తారు. అంటే, విశ్వంలోని శక్తిని ఈ ఆలయం ఒక యాంటెన్నా లాగా ఆకర్షించి భక్తులకు అందిస్తుంది. ఇది మూఢనమ్మకం కాదు, మన పూర్వీకులు దాచిన ఒక గొప్ప 'ఎనర్జీ సైన్స్'. మనం విస్మరిస్తున్న ఈ జ్ఞానం, తారా తారిణి ఆలయంలో ఇప్పటికీ సజీవంగా ఉంది."