TTD తాజా సమాచారం : భక్తులకు అందుబాటులోకొచ్చిన తిరుమల శ్రీవారి పుష్కరిణి | Tirumala news : Tirumala Swami pushkarini reopen for devotees

Vijaya Lakshmi

Published on Aug 22 2025

Vijaya Mavuru

SubscribeFollow

మహానటి, కలకంఠీ లాంటి నవలలు, సర్పయాగం, తిరుమల వైభవం, జై జగన్నాథ లాంటి పౌరాణిక లాంటి వ్యాసాలు. ఆంధ్రజ్యోతి, నవ్య, వనిత, వనితాజ్యోతి, చిత్ర, కోకిల లాంటి Magazine లలోను, అల్ ఇండియా రేడియో లోను Publish అయ్యాయి. Broad coast అయ్యాయి. నా వృత్తి, ప్రవృత్తి రెండూ కూడా రచనలు, Dubbing...

Want to know more about me and my work?
Click Here

నెల రోజులుగా మరమ్మత్తుల పనుల కారణంగా భక్తులకు అందుబాటులో లేని తిరుమల శ్రీవారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది.


శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా స్వామివారి పుష్కరిణి మరమ్మ‌తు పనులు నిర్వహించడం కొత్త హంగులతో తీర్చిదిద్దడం ప్రతి ఏడాది జరిగే కార్యక్రమమే.

ఈ సంవత్సరం కూడా తిరుమల పుష్కరిణి మర‌మ్మ‌తు పనులు టీటీడీ జూలై 20 తేదిన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్ విభాగంలోని దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారని ttd తెలిపింది.


స్వామి పుష్కరిణి మెట్లకు ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ రంగులు అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మర‌మ్మ‌తు పనులు పూర్తిచేశారు.

స్వామి పుష్కరిణి మరమ్మ‌తు ప‌నుల‌ నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదే విధంగా భక్తులను గత నెల రోజులపాటు స్వామి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. తిరిగి బుధ‌వారం నుండి భ‌క్తుల‌ను పుష్క‌రిణీలో అనుమ‌తించారు.


ఇవి కూడా చదవండి







Recent Posts